జేజమ్మ పెళ్ళెప్పుడు అమ్మ... ఇది ఇది అనుష్క అభిమానులు అంటున్న మాట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచెల్లోరెట్ ఎవరైనా ఉన్నారు అంటే అది అనుష్క అని చెప్పొచ్చు. సినిమాల్లో దశాబ్ద కాలం నుంచి నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది దాదాపు నలభై ఏళ్ళు. కానీ ఇప్పటికీ పెళ్లి ఊసే లేదు.
గతంలో ఈ వీటిని హీరోలకు కట్టబెట్టేశారు నెటిజన్లు. అయితే అసలు నోరు విప్పకుండా లైట్ తీసుకుంది అనుష్క. ముఖ్యంగా అనుష్క, ప్రభాస్ జోడీకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వెండితెరపై వీరి పెయిర్ చూసినప్పటి నుంచి నిజంగానే అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరికొందరయితే ఇంకా ముందుకు వెళ్లి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని గాసిప్స్ పుట్టించారు. బాహుబలి సమయంలో ఈ వార్తలు దావానంలా వ్యాపించాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అలాగే ప్రభాస్ బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అంటూ వార్తలు రావడం ఈ గాసిప్స్ కు ఆజ్యం పోసాయి. కానీ తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ అనుష్క సైతం పలు మార్లు వెల్లడించింది. కానీ ఆ వార్తలు మాత్రం ఆగలేదు. అయితే పుకార్లు పట్టించుకోకుండా అనుష్క బాహుబలి అనంతరం తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇటీవల సైలెన్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఈ ఏడాది మరో రెండు సినిమాలు చేస్తానని ప్రకటించింది. కానీ కరోనా రావడంతో ఆ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. ఇక సినిమాలేవీ చేయకుండా విరామం తీసుకున్న అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది అంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ సారి కూడా అనుష్క మౌనాన్ని ఆశ్రయించింది. అటు సినిమాలు చేయట్లేదు. అలాగని ఇటు పెళ్లి ఊసే లేదు. అందుకే ఆమె అభిమానులు జేజమ్మ పెళ్లెప్పుడు అమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: