అయితే హీరోయిన్ ఎన్ని విజయాలను అందుకున్నప్పటికీ వాళ్లకో ఇమేజ్ ఉన్నట్లు, స్థాయి ఉన్నట్లు గుర్తించడం తక్కువగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే.. అనుష్క, సమంత లాంటి కొంతమంది మాత్రమే ఇలాంటి గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇలాంటి కొంతమందికి మాత్రమే మరో సినిమాకు చీఫ్ గెస్ట్ అయ్యే అవకాశం అందుకున్నారు.
సాధారణంగా హీరోయిన్లు ఎప్పుడూ అతిథుల్లో ఒక్కరవుతుంటారు కానీ.. వాళ్లే ముఖ్య అతిథి కావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు పూజా హెగ్డే ఇలాంటి అరుదైన అవకాశాన్నే సొంతం చేసుకున్నారు. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్లో తెరకెక్కిన 'వరుడు కావలెను' మూవీ సంగీత్ ఈవెంట్కు పూజానే ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
ఇక ఈ విషయంపై ఆమె ఎంత ఎగ్జైట్ అయిందనేది తన ప్రసంగంలోనే కనిపిస్తుంటుంది. ఒక్క చిత్రానికి ఓ హీరోయిన్ చీఫ్ గెస్ట్గా రావడం అంటే ఎంత కష్టమో తనకు తెలుసని, ఇది తనకు దక్కిన గౌరవం అని ఆమె వ్యాఖ్యానించారు. అందుకు 'వరుడు కావలెను' నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంది ఈ భామ. ఈ సినిమాలో నటించిన రీతూ వర్మ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పూజాను కొనియాడారు. అంతేకాదు.. ఆ ఈవెంట్ కి వచ్చిన వారంతా పూజా గురించి ఒక్క రేంజ్ లో చెప్పుకొచ్చారు.