మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్లో హీరో హీరోయిన్పెళ్లి విషయం హాట్ టాపిక్ నడుస్తోంది. అనుష్క, ప్రభాస్, శర్వానంద్ వంటి హీరోలంతా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఆయన వయసు 32 ఏళ్లు. ఇంకా వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆలోచించకుండా కేవలం సినిమాల పై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ హీరో పెళ్లి విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. స్టార్ హీరోయిన్ తో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలుసనీ, పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అవుతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సాయి పల్లవి. ఆమె మొదటి తెలుగు చిత్రం ఫిదా. వరుణ్ తేజ్ కు, సాయి పల్లవి కి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టింది. వెండితెరపై వీరిద్దరి రొమాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అప్పట్నుంచి టాలీవుడ్లోని హిట్ పెయిర్ లిస్టులో సాయి పల్లవి వరుణ్ తేజ్ జంట చేరిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఆమెతో ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా మెగా ఫ్యామిలీ ఆ వార్తలను కొట్టి పారేసింది. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టాడు. మరోవైపు సాయి పల్లవి అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ టాలీవుడ్ లో దూసుకెళుతోంది. దీంతో వరుణ్ తేజ్ పెళ్లి విషయం మెగా అభిమానులు ఆసక్తికరంగా మారింది. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: