మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'గని' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి తన తండ్రి నాగబాబు తో కలిసి దుబాయ్ వెళ్ళాడు ఈ మెగా హీరో. ఈ క్రమంలోనే నిన్న ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టి20 క్రికెట్ ని లైవ్ లో చూసి ఎంజాయ్ చేశారు ఈ తండ్రి కొడుకులు. ఇక ఇప్పటికే దుబాయ్ లో షాపింగ్ ఖరీదైన హోటల్స్ లో స్టే.. ఫుడ్.. ఇలా తన మనసుకు నచ్చినట్లు వరుణ్, నాగబాబు వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

అయితే నిన్న జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పై నాగబాబు ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.' నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఓటమి అంటూ' నాగ బాబు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జనసేన పార్టీ లో అడుగు పెట్టినప్పుడు ఆ పార్టీ ఓడింది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజు కి సపోర్ట్ చేశారు.. ఆయన కూడా ఓడిపోయారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి దుబాయ్ వెళ్ళావ్. మ్యాచ్ ఓడిపోయింది. నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఓటమి అంటూ రకరకాలుగా ఓ రేంజ్ లో నాగబాబు ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం నాగబాబు ట్రోల్స్ తో నిండిపోయింది.

ఇక మరోవైపు ఇటీవలికాలంలో నాగబాబు కొందరిపై దారుణమైన కామెంట్ చేసి నెగిటివిటీని బాగా పెంచుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల ప్రముఖ సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారి పై నాగబాబు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి పద్ధతిగా లేవని ఇప్పటికే కొంతమంది సినిమా ప్రముఖులు నాగబాబు పై మండిపడ్డ విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు నెటిజన్స్ అంతా సోషల్ మీడియాలో నాగబాబుని ట్రోల్ చేస్తున్నారు. మరి దీనికి మెగా బ్రదర్ ఎలా స్పందిస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ఈ హీరో నటిస్తున్న 'గని' సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: