టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇటీవల గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన 'క్రాక్' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా హిట్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు మాస్ మహారాజా. వాటిలో శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా కూడా ఒకటి. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక సినిమాలో రవితేజ ఒక ఎమ్మార్వో అధికారిగా కనిపించబోతున్నాడు. ఇక ఆయన సరసన దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ఈ ఫైట్ సీన్.. సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుందట. అంతేకాదు కథకు చాలా కీలకమైన ఈ ఫైట్ సీన్ ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచీ ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో సినిమాపై చాలా పాజిటివ్ బజ్ నడుస్తోంది.

దానికి కారణం సినిమా టైటిల్ సరికొత్తగా ఉండటం.. ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కడం.. అలాగే రవితేజ మొదటిసారి ఒక ఎమ్మార్వో అధికారిగా సినిమాలో కనిపిస్తుండటం.. ఇవన్నీ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రవితేజ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ ఎమ్మార్వో అధికారిగా రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: