టాలీవుడ్ లో గత నాలుగైదేళ్లుగా చూస్తే కొంత మంది హీరోయిన్లు మాత్రమే ప్రభావం చూపిస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది హీరోయిన్లు ఇతర భాషల నుంచి వచ్చి మన తెలుగులో హడావిడి చేయడం చాలామందికి నచ్చడం లేదు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మన తెలుగులో దాదాపుగా నలుగురు హీరోయిన్లు ఎక్కువగా హడావుడి చేయడం మనం చూస్తున్నాము. అలాగే ఇతర భాషల హీరోయిన్లు కూడా కొంతమంది తెలుగులో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని ఈ నేపథ్యంలోనే కొంతమంది దర్శక నిర్మాతలు వారితో మాట్లాడుతున్నారని ప్రచారం కూడా జరిగింది.

అయితే ఇప్పుడు తెలుగులో కొంత మంది హీరోయిన్ల మధ్య విభేదాలు నడుస్తున్నాయని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. పూజా హెగ్డే రష్మిక మందన ఇటీవల రెమ్యూనరేషన్ భారీగా పెంచడం తో టాలీవుడ్  మరో హీరోయిన్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఆమె రెమ్యునరేషన్ భారీగా తగ్గించడమే కాకుండా సినిమా షెడ్యూల్ విషయంలో కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళుతున్నారని కొంతమంది దర్శకులు కూడా ఆమె పనితీరు విషయంలో అలాగే నటన విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని నిర్మాతలు కూడా ఆమె ను ఎక్కువగా తమ సినిమాల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

పూజా హెగ్డే ,రష్మిక మందన తమ సినిమాలకు నాలుగు నుంచి ఏడు కోట్ల వరకు డిమాండ్ చేయడం ఆమె మాత్రం కేవలం రెండు లేదా మూడు కోట్లు మాత్రమే అడగటం అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉండడం కొంతమంది దర్శక నిర్మాతలకు నచ్చుతుంది అని అంటున్నారు. దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో కొంతమంది దర్శక నిర్మాతలు వ్యవహార శైలితో స్టార్ హీరోయిన్ల మధ్య గొడవలు నడుస్తున్నాయి అని ఇద్దరు హీరోయిన్లు ఆమె మీద సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: