దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్.ఆర్. ఆర్.' టాలీవుడ్ అగ్రహీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇక బాహుబలి వంటి అద్భుత విజయం తర్వాత రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించడం, సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.

 కానీ షూటింగ్ ఆలస్యం, కరోనా వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే పలు వాయిదాల తర్వాత ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ నేపథ్యంలో త్రిబుల్ ఆర్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయని ఇప్పటికి అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగనుంది. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు కు సంబంధించిన సమస్య ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో..  త్రిబుల్ ఆర్ బిజినెస్ చెప్పిన రేట్లకు అవ్వడం లేదని అంటున్నారు.

ఇక దీని కంటే ముందే త్రిబుల్ ఆర్ బిజినెస్ ని పూర్తి చేసుకున్న వారు కూడా ఇప్పుడు ఈ కారణం చూపించి బిజినెస్ లో 30 శాతం  వరకు రేటు తగ్గించి ఒప్పించుకున్నారనే  వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో రిలీజ్ కు ముందే నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాస్ అని అంటున్నారు. ఇక మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల రేట్లు సమస్యపై సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సినిమాల బిజినెస్ పై గట్టి ప్రభావం పడుతోంది. దీంతో నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు చేకూరే అవకశాలు కనిపిస్తున్నాయి.ఇక త్రిబుల్ ఆర్ ప్రమోషన్ విషయానికి వస్తే.. అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ తో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని అనుకుంటున్నారు మేకర్స్.ఈ క్రమంలోనే అక్టోబర్ 29 న త్రిబుల్ ఆర్ నుంచి టీజర్ విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: