రంగస్థలం సినిమాతో
సుకుమార్ ఏ స్థాయి విజయం అందుకొన్నాడో అందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఆ
సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించి ఆయనకు మరపురాని విజయాన్ని అందించింది. సుకుమార్ దర్శకత్వంలో వెరైటీ కథాంశంతో తెరకెక్కిన ఈ
సినిమా గతంలో ఎప్పుడూ చేయని విధంగా
సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకున్నాడు.
సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాకు భారీ లాభాల్ని చేకూర్చింది. దాంతో
సుకుమార్ చేయబోయే తదుపరి సినిమాపై ఇప్పుడు అందరిలో ఎంతగానో అంచనాలు ఉన్నాయి.
ఆ క్రమంలోనే
అల్లు అర్జున్ తో కలిసి
సుకుమార్ పుష్ప సినిమాను చేస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం యొక్క మొదటి భాగాన్ని
క్రిస్మస్ కానుకగా
డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయబోతున్నాడు సుకుమార్. ఈ చిత్రంలో
అల్లు అర్జున్ డి గ్లామర్ పాత్రలో నటించడమే కాకుండా లారీ
డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ
సినిమా నుంచి రెండు పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మూడవ పాటను విడుదల చేయడానికి రంగం సిద్దం అయింది.
అయితే తాజాగా మూడో పాట కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆ పాటను చూసిన ప్రతి ఒక్కరు కూడా
సుకుమార్ కు ఇంకా రంగస్థలం హ్యాంగోవర్ దిగనే లేదు అంటున్నారు. ఈ పాట సేమ్ రంగస్థలం
సినిమా లోని రంగమ్మ మంగమ్మ అనే పాటలానే ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచులు రోజురోజుకు మారిపోతున్నాయి. రంగస్థలం
సినిమా సమయంలో ప్రేక్షకుల అభిరుచి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ
సినిమా హిట్ అయింది. ఇప్పుడు వారి అభిరుచి వేరేలా ఉంది. ఈ నేపథ్యంలో
సుకుమార్ మళ్లీ రంగస్థలం
సినిమా ను గుర్తు చేసేలా పాటలను విడుదల చేయడం సినిమాపై భారీ ప్రభావం చూపుతుందని అంటున్నారు.