రంగస్థలం సినిమాతో సుకుమార్ ఏ స్థాయి విజయం అందుకొన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించి ఆయనకు మరపురాని విజయాన్ని అందించింది.  సుకుమార్ దర్శకత్వంలో వెరైటీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా గతంలో ఎప్పుడూ చేయని విధంగా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకున్నాడు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాకు భారీ లాభాల్ని చేకూర్చింది. దాంతో సుకుమార్ చేయబోయే తదుపరి సినిమాపై ఇప్పుడు అందరిలో ఎంతగానో అంచనాలు ఉన్నాయి.

ఆ క్రమంలోనే అల్లు అర్జున్ తో కలిసి సుకుమార్ పుష్ప సినిమాను చేస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం యొక్క మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయబోతున్నాడు సుకుమార్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డి గ్లామర్ పాత్రలో నటించడమే కాకుండా లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి రెండు పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మూడవ పాటను విడుదల చేయడానికి రంగం సిద్దం అయింది.

అయితే తాజాగా మూడో పాట కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆ పాటను చూసిన ప్రతి ఒక్కరు కూడా సుకుమార్ కు ఇంకా రంగస్థలం హ్యాంగోవర్ దిగనే లేదు అంటున్నారు. ఈ పాట సేమ్ రంగస్థలం సినిమా లోని రంగమ్మ మంగమ్మ అనే పాటలానే ఉందని కామెంట్లు పెడుతున్నారు.  ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచులు రోజురోజుకు మారిపోతున్నాయి. రంగస్థలం సినిమా సమయంలో ప్రేక్షకుల అభిరుచి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు వారి అభిరుచి వేరేలా ఉంది. ఈ నేపథ్యంలో సుకుమార్ మళ్లీ రంగస్థలం సినిమా ను గుర్తు చేసేలా పాటలను విడుదల చేయడం సినిమాపై భారీ ప్రభావం చూపుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: