టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో వెండితెరకు దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్న రీతిలో చేయబోతున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఇటీవల వరుడు కావలెను చిత్ర యూనిట్ సంగీత్  కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మేకర్స్.

 ఇక ఈ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి స్పందనను కనబరిచింది. ట్రైలర్ లో నాగ శౌర్య చాలా స్టైలిష్ అండ్ హాండ్స్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక గతంలో నాగ శౌర్య నటించిన 'కళ్యాణ వైభోగమే' సినిమాను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆ సినిమా కూడా వివాహ నేపథ్యంతో ఫ్యామిలీ రిలేషన్స్ ను హైలెట్ చేస్తూ తెరకెక్కిన సినిమానే.

ఇక 'వరుడు కావలెను' సినిమా కూడా అదే నేపధ్యంతో విభిన్నమైన కథా,కథనాలతో కొనసాగుతోంది. ఇక ఈ సినిమాకి నాగశౌర్య స్క్రీన్ ప్రెజెన్స్, రీతు వర్మ గ్లామర్ ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటి నదియా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమా తరువాత నాగశౌర్య వరుస ప్రాజెక్టులకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు 'లక్ష్య' అనే సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేశాడు నాగశౌర్య. ఈ సినిమా కూడా మరికొన్ని నెలలోనే విడుదలకు ముస్తాబవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: