అయితే అల్లు ఫ్యామిలీ హీరోలు అర్జున్ , శిరీష్ కనీసం ఓటు వేసేందుకు కూడా రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఎలాగైనా పరోక్షంగా ఓడించాలని కంకణం కట్టుకున్న బాలయ్య లాంటి వాళ్లను అల్లు అరవింద్ తన ఆహా ప్లాట్ పామ్లోకి తీసుకు వచ్చారు. బాలయ్య ఈ ఆహా డిజిటల్ వేదికగా అన్స్టాప్బుల్ అనే టాక్ షో చేస్తున్నారు. ఈ పరిచయం కార్యక్రమంలో బాలయ్య అల్లు అరవింద్ను, అల్లు అర్జున్ను ఏకంగా ఆకాశానికి ఎత్తేశారు.
అటు అల్లు ఫ్యామిలీ కూడా బాలయ్యతో పాటు ఎన్టీఆర్ తో తమకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఇప్పుడు అల్లు వారు మెగాకు మరో మంట పెట్టేస్తున్నారట. ఈ టాక్ షోకు ఫస్ట్ గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబును తీసుకు వస్తున్నారట. అసలు ఇటీవల మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. ఇప్పుడు మోహన్ బాబు ఈ టాక్ షో గెస్ట్ గా వస్తే మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతలా చిర్రెత్తి పోతారో చెప్పక్కర్లేదు.
పైగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరంజీవితో పాటు ఆయన సోదరులకు ఆహ్వానం అందలేదని కూడా మెగా అభిమానులు మండి పోతున్నారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ తో సంబంధం లేకుండా అల్లు అరవింద్ తన దారిలో తాను వెళుతున్నారన్నది వాస్తవం.