మెగా ఫ్యామిలీ వేరు.. అల్లు ఫ్యామిలీ వేరా.. గ‌త కొంత కాలంగా ఉన్న అనేక సందేహాల‌కు ఇప్పుడు అల్లు అర‌వింద్ నేరుగా క్లారిటీ ఇచ్చేస్తున్నారా ? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇదే విష‌యం అవున‌నే అని చ‌ర్చకు వ‌స్తోంది. ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లో మెగా కాంపౌండ్ స‌పోర్ట్ ఉన్న ప్ర‌కాష్ రాజ్ ను ఓడించేందుకు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో పాటు బాల‌య్య లాంటి వాళ్లు త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేశారు. బాల‌య్య డైరెక్టుగా చెప్ప‌క పోయినా ఆయ‌న స‌పోర్ట్ త‌న‌కే ఉంద‌ని విష్ణు చెప్పారు. త‌ర్వాత మోహ‌న్ బాబు కూడా బాల‌య్య‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్ర‌శంసించారు. ఇక త‌మ ఫ్యామిలీ స‌పోర్ట్ ఉంద‌ని ప్ర‌కాష్‌రాజ్‌కు నాగ‌బాబు లాంటి వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ చెప్పారు.

అయితే అల్లు ఫ్యామిలీ హీరోలు అర్జున్ , శిరీష్ క‌నీసం ఓటు వేసేందుకు కూడా రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఎలాగైనా ప‌రోక్షంగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న బాల‌య్య లాంటి వాళ్ల‌ను అల్లు అర‌వింద్ త‌న ఆహా ప్లాట్ పామ్‌లోకి తీసుకు వ‌చ్చారు. బాల‌య్య ఈ ఆహా డిజిట‌ల్ వేదిక‌గా అన్‌స్టాప్‌బుల్ అనే టాక్ షో చేస్తున్నారు. ఈ ప‌రిచ‌యం కార్య‌క్ర‌మంలో బాల‌య్య అల్లు అర‌వింద్‌ను, అల్లు అర్జున్‌ను ఏకంగా ఆకాశానికి ఎత్తేశారు.

అటు అల్లు ఫ్యామిలీ కూడా బాల‌య్య‌తో పాటు ఎన్టీఆర్ తో త‌మ‌కు ఉన్న అనుబంధం నేప‌థ్యంలో ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఇప్పుడు అల్లు వారు మెగాకు మ‌రో మంట పెట్టేస్తున్నార‌ట‌. ఈ టాక్ షోకు ఫ‌స్ట్ గెస్ట్ గా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబును తీసుకు వ‌స్తున్నార‌ట‌. అస‌లు ఇటీవ‌ల మోహ‌న్ బాబు వ‌ర్సెస్ మెగా ఫ్యామిలీ మ‌ధ్య తీవ్ర‌మైన వార్ న‌డుస్తోంది. ఇప్పుడు మోహ‌న్ బాబు ఈ టాక్ షో గెస్ట్ గా వ‌స్తే మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంత‌లా చిర్రెత్తి పోతారో చెప్ప‌క్క‌ర్లేదు.

పైగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారానికి చిరంజీవితో పాటు ఆయ‌న సోద‌రుల‌కు ఆహ్వానం అంద‌లేద‌ని కూడా మెగా అభిమానులు మండి పోతున్నారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ తో సంబంధం లేకుండా అల్లు అర‌వింద్ త‌న దారిలో తాను వెళుతున్నార‌న్న‌ది వాస్త‌వం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: