టాలీవుడ్ ఇపుడు చాలా అయోమయంలో ఉంది సినిమాలు పూర్తి అయినా రిలీజ్ కి నోచుకోలేని సీన్ ఉంది. మంచి సీజన్లు కళ్ల ముందే కరగిపోయాయి. నిజానికి కరోనా తగ్గి దసరా సీజన్ బాగానే ఉంటుందనిపించింది. అయితే ఆంధ్రా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం వల్ల, థియేటర్లలో సెంట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద చివరి దాకా డౌట్ ఉండడం వల్ల పెద్ద సినిమాలు అన్నీ రేసు నుంచి వెనక్కిపోయాయి.

అలా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలక్రిష్ణ ఆచార్య మూవీస్ రెండూ కూడా రిలీజ్ కి దూరంగా ఉండిపోయాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని వంటి సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. ఈ సమయంలో చిన్న సినిమాలు నాలుగు వస్తే అందులో రెండు హిట్ అయ్యాయి. బాగానే లాభాలను గడించాయి. మరి పెద్ద సినిమాల మాటేంటి, అవెపుడు రిలీజ్ అంటే డిసెంబర్ లో కూడా పెద్దగా రిలీజ్ కి ఎవరూ ఉత్సాహం చూపించడంలేదు. అప్పటికి కూడా చాలా విషయంలో క్లారిటీ రాదు అన్న డౌట్లు ఉన్నాయట.

జనవరి నెల సంక్రాంతి పండుగ ఉంది. కానీ ఆ టైమ్ కి ట్రిపుల్ ఆర్ రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. దాంతో అందరూ కలసి ఫిబ్రవరికి వెళ్లిపోయారు. నిజానికి టాలీవుడ్ లో ఫిబ్రవరికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. మార్చిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి ఆ ముందు నెల కూడా కాస్తా డల్ గానే ఉంటుంది. దాంతో మళ్లీ పెద్ద సినిమాలు అన్నీ కూడా సమ్మర్ సీజన్ కోసం ఏప్రిల్ నుంచే లైన్ కడతాయి.

కానీ ఈసారి మాత్రం అంతా ఫిబ్రవరి మీద పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ఫిబ్రవరికి వాయిదా పడింది అని వార్తలు వచ్చాయి. అదే విధంగా ఇపుడు ప్రముఖ నిర్మాత  దిల్ రాజ్ కూడా తన ఎఫ్ 3 మూవీని ఫిబ్రవరి 26కి తీసుకెళ్ళిపోయారు. నిజానికి ఈ మూవీ సంక్రాంతి రేసులో ఉంటుంది అనుకున్నారు. ఇక బాలయ్య అఖండ మూవీ కూడా డిసెంబర్ లో కాకపోతే ఫిబ్రవరికే అంటున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న కొన్ని సినిమాలు కూడా డ్రాప్ అయితే ఫిబ్రవరికే వస్తాయని టాక్. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫిబ్రవరి మంత్ టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ అయిపోయింది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: