ఇటీవలే అల వైకుంఠపురంలో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో బన్నీ సరసన మొదటిసారి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

 కానీ తాజా సమాచారం 'పుష్ప పార్ట్ 1' విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించి 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అందుకే ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబో లో వస్తున్న సినిమా ఇది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది దాదాపు. 180 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మూడవ సింగిల్ ని ఈ చిత్ర బృందం విడుదల చేయగా.. సోషల్ మీడియాలో ఈ ప్రోమో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: