టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా వరస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు ఆకాశ్. ఈ క్రమంలో తన పర్సనల్ లైఫ్ తో పాటు తన తండ్రి పూరి జగన్నాథ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

అంతేకాకుండా తన సోదరి పవిత్ర కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఆకాష్. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.." భవిష్యత్తులో డైరెక్టర్గా పని చేసే అవకాశం ఉందని.. కాకపోతే కథలు డైలాగ్స్ రాయడం తనవల్ల కాదు అని చెప్పాడు. ఇక ఎవరి దగ్గర నుంచి అయినా మంచి కథ దొరికితే ఫ్యూచర్లో కచ్చితంగా ఒక సినిమాను డైరెక్ట్ చేస్తానని తెలిపాడు. డైరెక్టర్ జాబ్ అనేది అంత ఈజీ కాదని ఆ విషయంలో నాన్నగారు చాలా బాగా ఆలోచిస్తారని ఆకాష్ పేర్కొన్నాడు. ఇక పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దానిపై కూడా ఆకాష్ క్లారిటీ ఇస్తూ.. బుజ్జిగాడు సమయంలోనే తన చెల్లి పవిత్ర నటించనని చెప్పిందని.. అప్పటికీ నాన్న ఫోర్స్ వల్లే నటించిందని తెలిపారడు. ఇక తన చెల్లికి యాక్టింగ్ పై అంతగా ఇంట్రెస్ట్ లేదని.. కాకపోతే ఆమె ప్రొడక్షన్ రంగంలోకి రావాలని ఎంతో ఆశగా ఉన్నట్లు తెలిపాడు. తప్పకుండా మరికొన్ని సంవత్సరాల్లో తన చెల్లి నిర్మాతగా అడుగులు వేసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు ఆకాష్. ఇక రొమాంటిక్ విషయానికి వస్తే.. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటించగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: