టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య కాలంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమా కి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఏదో ఒక రూపంలో తన వంతు భాగంగా ఆ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'అద్భుతం' సినిమా పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. అద్భుతం సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ  సినిమాకి కథ అందించాడు. ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. డిఫరెంట్ టైం పీరియడ్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఈ కథను రాయడం జరిగింది. ఇలాంటి జోనర్ ఉన్న సినిమాలు గతంలో చాలానే వచ్చాయి.

 కానీ టైం పీరియడ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ మాత్రం ఇదే కావడం విశేషం. అలాంటి సరికొత్త కథతో ప్రశాంత్ వర్మ దర్శకుడు మల్లిక్ రామ్ మ్యాజిక్ చేశారు. ఇక ఈ సినిమాలో తేజ ప్రజా శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాతో రాజశేఖర్ కూతురు శివాని వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక సినిమాలో ఈ ఇద్దరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాంటిక్ గా నటిస్తూనే.. ఎమోషన్ సీన్స్ లో మెప్పించారు ఈ ఇద్దరు. ఇక తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.."అద్భుతం సినిమాని హాట్ స్టార్ లో చూసాను.

ఇది చాలా ఎంగేజింగ్ గా సాగే న్యూ ఏజ్ ఫిల్మ్. నావేల్ కాన్సెప్ట్ తో ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. తేజ సజ్జ, శివాని ఇద్దరూ ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ అందించారు. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉంది. అద్భుతం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేసాడు.ఇక చిరంజీవి ప్రశంసలతో ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయిన తేజ సజ్జా ఆ ట్వీట్ కి వెంటనే రెస్పాండ్ అవుతూ.. మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ కి తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో  చిన్నప్పటి పాత్రలో మెరిశాడు ఈ హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: