పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో 'సలార్' కూడా ఒకటి. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కేజిఎఫ్ నిర్మాతలు నిర్మిస్తుండటం విశేషం. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ కి సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. తన కథా, కథనం తో మ్యాజిక్ ని క్రియేట్ చేసే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా లో భారీ ఎమోషనల్ సీన్స్ ని కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 ఇక సినిమాలో ప్రభాస్ తండ్రీ,కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని.. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. అదేంటంటే ఏ సినిమాలో ప్రభాస్, శృతి హాసన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని అంతే కాకుండా ఈ సినిమా క్లైమాక్స్ లో శ్రుతిహాసన్ పాత్ర చనిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రుతిహాసన్ ఈ సినిమాలో ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.

 అయితే క్లైమాక్స్ లో శ్రుతిహాసన్ పాత్ర చనిపోవడం ఏంటని ఈ వార్త తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని ఆ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపిస్తుందని సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ని అంచనాలకు మించి ఏ విధంగా ఈ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్లు సమాచారం. సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో ఓ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: