ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పుష్ప'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మొత్తం శెట్టి మీడియా తో కలిసి ఇ సంయుక్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్ని కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఇక సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

బన్నీ సినిమాలో మునుపెన్నడూ కనిపించినంత ఊర మాస్ లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సుకుమార్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డ నా అడ్డా అనే సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా యూట్యూబ్ లో భారీ రికార్డ్స్ ని క్రియేట్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను త్వరలోనే మరో అప్ డేట్ కూడా రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. షూటింగ్ ఇంకా కంప్లీట్ అవలేదు.

 ఈ నెల రోజుల గ్యాప్ లోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలి. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ పూర్తి చేయాలి  ఈ క్రమంలోనే చిత్రయూనిట్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ట్రైలర్ను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ను ఏకంగా దుబాయిలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చివరి పాటను ఈ చిత్ర టీం షూట్ చేస్తోంది ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా పుష్ప పార్ట్ 1 విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: