టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. 60 పదుల వయసులో కూడా అదిరిపోయే స్టెప్పులు లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు చిరు. సినిమా నుంచి పదేళ్ల కు పైగా వ్యాప్ తీసుకున్నా తన డాన్స్ లో మాత్రం గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు ఈ సీనియర్ హీరో. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఆయన వేసిన డాన్స్ స్టెప్పులు అభిమానులతో విజిల్స్ వేయించాయి. ఆ సినిమాలో ముఖ్యంగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే పాటకి తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన డాన్స్ కి తెలుగు ప్రేక్షకులు సైతం దాసోహం అయిపోయారు. 

ఇక ఆ పాటకి అభిమానులు మెచ్చేలా మెగాస్టార్ చిరంజీవి తో అదిరిపోయే స్టెప్పులు వేయించింది మన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఇక ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఆయన ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ తో ముచ్చటగా మూడోసారి అవకాశాన్ని దక్కించుకున్నాడు శేఖర్ మాస్టర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా 'భోళాశంకర్'. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాకి ఇది రీమేక్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా..

 మరో స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ చిరు కి చెల్లెలు గా కనిపించనుంది . అయితే ఈ సినిమాలో ఓ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన విషయాన్ని శేఖర్ మాస్టర్ తన సోషల్ మీడియా వేదిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి తో శేఖర్ మాస్టర్ ఉండడం గమనించవచ్చు. శేఖర్ మాస్టర్ మూడోసారి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఓ మాస్ సాంగ్ చేస్తున్నానంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు నెటిజన్లు హ్యాట్రిక్ ఖాయమని కామెంట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: