టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్ దాని అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సరదాగా గడుపుతున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చాక ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ తో 'జనతా గ్యారేజ్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

 ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఎన్టీఆర్ కొరటాల కూడా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాకి కొరటాల శివ మాటలు అందించాడు  ఆ సమయం నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎన్టీఆర్.. తన తదుపరి సినిమా విషయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే కొరటాల శివ సినిమా గురించి మాట్లాడుతూ..'

సినిమా 2022 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపాడు. అంతే కాకుండా ఈ సినిమా ఒక రివేంజ్ డ్రామా గా తెరకెక్కనుందని.. దాదాపు ఆరు నుంచి ఏడు నెలల లోపే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ఎన్టీఆర్ తెలిపాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులు అంచనాలు రెట్టింపయ్యాయి. కొరటాల శివ ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్కు సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత మాత్రం రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: