భద్ర
సినిమా తర్వాత
బోయపాటి శ్రీను ఎలాంటి సినిమాలను తెరకెక్కించాలని ప్రేక్షకులు భావించారో అలాంటి సినిమాలే ఇప్పటివరకూ చేస్తూ ఎన్నో
బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తనదైన స్టైల్ లో
మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీస్తూ ఇప్పుడు ఎంత దూరం వచ్చాడు. ప్రస్తుతం ఆయన నందమూరి
బాలకృష్ణ తో కలిసి మూడవ సినిమాను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన
సింహా లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ లు కాగా ఈ చిత్రంపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే ఆయన
సినిమా లకు పనిచేసే టెక్నీషియన్స్ తో
బోయపాటి శ్రీను చాలా మైత్రితో ఉంటారు. ఒకటి రెండు సందర్భాలలో ఆయనకు టెక్నీషియన్స్ తో గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవేవి బయటకు రాలేదు కానీ ఓ సందర్భం మాత్రం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. గతంలో ఓ
సినిమా సందర్భంగా
దేవిశ్రీప్రసాద్ తో ఆయనకు విభేదాలు వచ్చాయి. ఏకంగా స్టేజ్ మీద వీరిద్దరూ పోట్లాడుకున్న పరిస్థితి వచ్చింది. ఈ విషయం ఆ తర్వాత ఎంత దూరం వెళుతుందో అని ఇండస్ట్రీలోని అందరు చర్చించుకున్నారు.
అయితే
బోయపాటి శ్రీను ఇవేవీ పట్టించుకోలేదు. ఇష్యూ తర్వాత కూడా ఆయన దేవి
శ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేయడం ఆయనలోని ఈగో లేని తనాన్ని చూపిస్తుంది. దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్లలో పనిచేసిన
బోయపాటి శీను ప్రస్తుతం చేస్తున్న అఖండ
సినిమా కి
తమన్ ని
సంగీత దర్శకుడి గా ఎంచుకున్నాడు. కాగా ఈ నేపథ్యంలో లో
తమన్ బోయపాటి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆయన పేరు కు
మాస్ దర్శకుడైనా ఎంతో క్లాస్ మనిషి అన్నారు. కథ పట్ల దర్శకత్వం పట్ల ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి అని అందుకే ఇంత దూరం వచ్చి
సినిమా లలో
సక్సెస్ అయ్యారని ఆయన చెప్పారు.