యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెండి తెర పై కనిపించి మూడు సంవత్సరాలు అవుతుంది. ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తో ధియేటర్ లలో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ వద్ద అందుకున్నాడు. అరవింద సినిమా సమేత సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన కారోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

 ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ  సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కకాబోయే సినిమాలో నటించబోతున్నాడు, అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక మీడియా పబ్లికేషన్స్ తో మాట్లాడిన ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఒక రివేంజ్ డ్రామా అని, ఆ సినిమా 2022 ఫిబ్రవరి లో ప్రారంభం కాబోతున్నట్లు ఎన్టీఆర్ తెలియజేశాడు. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ , కే జి ఎఫ్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నిల్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో  తెరకెక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: