ఇక సూర్య నటించిన అలాంటి సినిమాలలో సెవెంత్ సెన్స్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కధ విషయానికి వస్తే చైనా దేశంలో ఒక వైరస్ ను పుట్టించి, దానిని భారతీయుల మీద ప్రయోగం చేసి , వ్యాక్సిన్ లేని సమయంలో ఆర్థిక నష్టం, ప్రాణనష్టం జరుగుతున్నప్పుడు చివరి క్షణాల్లో అత్యధిక ఖర్చుతో వ్యాక్సిన్ ఇస్తామంటూ ప్రజలను మోసగించి, చైనా వాసులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకున్నట్టుగా చూపిస్తారు. కానీ బోధిధర్మ చెప్పిన ఆయుర్వేద సూత్రాలను ప్రజలు ఆచరించేలా చేసి ఆ వైరస్ నుంచి ప్రజలను కాపాడాడు హీరో.. ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు.
ఇక దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా మహమ్మారి చైనా దేశం నుండి పుట్టుకొచ్చి ప్రపంచ ప్రజలందరినీ వణికిస్తోంది. ఆర్థిక నష్టం , ప్రాణ నష్టం తో పాటు ఎంతో మంది పిల్లలు ఒంటరి వాళ్ళయ్యారు. ఇక ప్రస్తుతం భయపడుతూనే ప్రజలు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. సెవెంత్ సెన్స్ సినిమా లో చూపించిన సరికొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశ ప్రజలందరినీ భయపెడుతోంది.