మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయం వైపు దృష్టి మళ్ళించి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరం అయ్యారు, ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. ఇలా రీ ఎంట్రీ లో మొదటి రెండు సినిమాలకు మధ్య కొంత సమయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం మాత్రం ఒక సినిమా సెట్స్ పై  ఉండగానే మరో సినిమా లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నాడు, ఈ సినిమాను 2022 ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

 ఈ సినిమా తో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు, ఈ సినిమా ను కూడా 2022 వ సంవత్సరం లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమా లతో పాటు ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాను కూడా 2022 లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట, దీనితో పాటే బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్క బోతున్న సినిమా  షూటింగ్ ను కూడా చక చక పూర్తి చేసి 2022 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిరంజీవి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇ లా చిరంజీవి ఒకే సంవత్సరం నాలుగు సినిమాబ్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: