నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన తాజా చిత్రం 'అఖండ'. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మించారు. సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా, అఘోరగా రెండు విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఇక బాలయ్య సరసన సినిమాలో యువ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 27న హైదరాబాదులో చిత్ర యూనిట్ నిర్వహించనుంది.

 అయితే చిత్ర యూనిట్ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్న సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా సింపుల్ గా జరుపుతున్నట్లు తెలియజేశాడు. ఆ ప్రెస్ మీట్ లో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..' అఖండ సినిమాకి మొదట మేము ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసాము. కానీ బాలకృష్ణ గారు చేతికి సర్జరీ అయిన కారణంగా చాలా సింపుల్ గా ఈ ఈవెంట్ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం' అని నిర్మాత వెల్లడించాడు. కొద్ది రోజుల క్రితం బాలయ్య చేతికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.

అయితే బాలయ్య చెప్పడం వల్లే నిర్మాత అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సింపుల్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అఖండ అడ్వాన్స్ బుకింగ్ వస్తున్నా స్పందనతో ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని అఖండ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో టికెట్ లు నిమిషాల్లోనే అమ్ముడు పోయాయని నిర్మాత రవీందర్రెడ్డి వెల్లడించాడు. దీంతో చిత్ర యూనిట్ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అఖండ విడుదల కోసం బాలయ్య అభిమానులైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో 'అఖండ' హ్యాట్రిక్ హిట్ సాధిస్తుందని భావిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: