కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే నెలలో చాలా క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతూ ఉంటాయి అయితే తాజాగా 2022 జనవరిలో కూడా ఇదే సీన్ కనపడుతుంది .ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నారు, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలు గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కేంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు, ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇలా ఈ రెండు సినిమాలతో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పోటీ పడుతున్నాడు, ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రాదే శ్యామ్  జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇ లా టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికే జనవరి నెల బాక్సాఫీస్ బరిలో నిలవగా తమిళ హీరో కూడా ఈ రేస్ లోకి వచ్చాడు, కోలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విశాల్ తాను నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ హీరో నటించిన సామాన్యుడు సినిమాను 26:1:2022 నా విడుదల చేయబోతున్నట్లు తాజా గా తెలియజేశాడు. ఇలా జనవరి రేస్ లో విశాల్ కూడా చేరిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: