టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా దృశ్యం 2. జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా నిన్న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మీనా, తనికెళ్ళ భరణి, నదియా, సంపత్ రాజ్, నరేష్ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన దృశ్యం మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇక మంచి అంచనాలతో నిన్న రిలీజ్ అయిన దృశ్యం 2 కూడా ఫైనల్ గా సూపర్ సక్సెస్ టాక్ అందుకుంది.

ముఖ్యంగా సినిమాలో వెంకటేష్ అద్భుత నటన, ఇతర పాత్రల ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు కథని ఎక్కడా కూడా ప్రక్క దారి పట్టించకుండా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీసిన జీతూ జోసెఫ్ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయితే తమని మరింతగా ఆకట్టుకోవడంతో పాటు చివరి ముప్పై నిముషాలు అయితే మరింత అద్భుతంగా ఉంది మూవీ అంటూ పలువురు టాలీవుడ్ ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంతవరకు అంతా బాగున్నప్పటికీ, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ లో కొందరు మాత్రం ఈ సక్సెస్ పై ఒకింత నిరాశ వ్యక్తం చేస్తూ అభిప్రాయపడుతున్నారు.

దానికి కారణం, గతంలో వెంకీ నటించిన నారప్ప సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని భావించిన తమకు అది ఓటిటి లో రిలీజ్ చేసారని, అలానే ప్రస్తుతం దృశ్యం 2 ని కూడా వోటిటి లోనే రిలీజ్ చేయడం తమకు సమంజసంగా అనిపించలేదని, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో, ఒకవేళ ఇవి థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండి ఉంటె బాగా కలెక్షన్స్ సొతం చేసుకునేవి అనేది వారి అభిప్రాయం అని తెలుస్తోంది. అయితే వెంకీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటేంటే ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఎఫ్ 3 వచ్చే ఏడాది ఫిబ్రవరి లో థియేటర్స్ లో రిలీజ్ కానుండడం. మరి ఆ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: