మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఆచార్య సినిమా ఒకటి, ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కు జంటగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను, టీజర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాలు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను ఈనెల 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కూడా తాజా గా చిత్ర బృందం తెలియజేసింది.

 ఇలా ఎప్పటికప్పుడు టీజర్, పాటలు, పోస్టర్ లతో ఆచార్య చిత్రబృందం ఎప్పటికప్పుడు ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తి కరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది, ఆచార్య సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ పూర్తయినట్టు, ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తో పాటు గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమాల షూటింగ్ లతో కూడా బిజీగా ఉన్నాడు, అలాగే బాబీ దర్శకత్వం లో కూడా చిరంజీవి ఒక సినిమాలో హీరోగా నటించడానికి రెడీ గా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: