మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. అంతే కాదు ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, కైరా అద్వాని లపై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు.

 మరోవైపు ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా కోసం 40 కోట్లు ఖర్చు పెట్టి ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ సెట్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో రూపొందనున్న ఈ పాటలో అమెరికా, ఉక్రెయిన్, రష్యా, ఆఫ్రికా, బ్రెజిల్, యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డ్యాన్సర్లు పాల్గొనబోతున్నారట. దాదాపు పది రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ భారీ సెట్లో పది రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ పాట కోసం ఇప్పటికే..

 వివిధ దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు రామోజీ ఫిలిం సిటీ లో బస చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా దర్శకుడు శంకర్ ఈ పాటని చిత్రీకరించబోతున్నారట. దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు దాదాపు 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు. ఆయన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 50వ సినిమాగా ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఖర్చుకి దిల్ రాజు ఎక్కడా వెనకాడడం లేదు. ఇక ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, సునీల్, అంజలి, మలయాళ నటుడు జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: