ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు వారి పాట మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే దీని తరువాత త్వరలో తదుపరి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు సూపర్ స్టార్ మహేష్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి కూడా థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అయితే రెండు రోజుల నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి పూజా హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు.
అయితే దానికి కారణం ఆమెకు ప్రస్తుతం వరుసగా ఆఫర్లు వస్తుండడమే అని, ఇప్పటికే రాబోయే ఏడాది డేట్స్ ని పలు ఇతత్ర సినిమాలకు కేటాయించిన పూజా మహేష్, త్రివిక్రమ్ ల సినిమాని వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని టాక్. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై నిర్మాతల నుండి అఫీషియల్ గా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయకతప్పదని అంటున్నారు విశ్లేషకులు.