కమలహాసన్ ఆరోగ్యంపై ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కమల్ హాసన్ ఆరోగ్యం కుదుటగానే ఉందని వైద్యులు తెలియజేశారు. తను కూడా చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసేటటువంటి కొన్ని సినిమా ప్రాజెక్టులే అనారోగ్యానికి దారితీస్తోందట. తాజాగా తమిళం లో ప్రసారమయ్యే బిగ్ బాస్ -5 కి యాంకర్ గా చేస్తున్నారు కమల్ హాసన్. అయితే ఇది లైవ్ లో చేయాలి కనుక వీటిపై పలు రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి.

కమలహాసన్ కి రీప్లేస్మెంట్ శృతి హాసన్ ని రెండు వారాల పాటు, యాంకర్ గా ఉండేందుకు ఒప్పించారు అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ విషయం పై చివరి నిమిషంలో కొన్ని విషయాలు మారిపోయాయని తెలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ కి బదులుగా శృతిహాసన్ కాకుండా.. హీరోయిన్ రమ్యకృష్ణ ని హోస్ట్ గా తీసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరించింది రమ్యకృష్ణ.


అందుచేతనే తమిళ నిర్వాహకులు దృష్టి అంతా ఈమె వైపు మళ్ళింది. ఇక ఈమె పేరు బాగా ఈ మధ్య ఎక్కువగా వినిపించడంతో..ఈమెను ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సివుంది రమ్యకృష్ణ చెన్నై పరిశ్రమకు చెందినవారు కాబట్టి అక్కడే తన కెరీర్ను కూడా స్పీడ్ అప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.ఇక చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోతున్న రమ్యకృష్ణ ఇటు తెలుగులోనూ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

అలాగే కమలహాసన్ వారసురాలు అయినటువంటి శృతి హాసన్ కూడా తాజాగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శృతి హాసన్ ప్రశాంత్ నీల్ , ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈమె నటించిన మరికొన్ని సినిమాలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతూ.. హాలీవుడ్ రేంజ్లో ఎదిగే ప్రయత్నంలో ఉంది శృతిహాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: