తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవలే నాగచైతన్య సమంత విడాకుల విషయం సంచలనంగా మారిపోయింది. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం  ఇక పెళ్లి వరకు వచ్చింది. ఇక అక్కినేని కోడలు గా మారిన తర్వాత ఒక్కసారిగా  సమంత క్రేజ్  పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస విజయాలు కూడా అందుకుంది ఈ అమ్మడు. అయితే ఈ అక్కినేని జంటకీ తెలుగు చిత్ర పరిశ్రమలో యమ క్రేజ్ వుంది అని చెప్పాలి. అలాంటిది ఈ జంట ఒక్కసారిగా తాము డివోర్స్ తీసుకున్నాము అంటూ ప్రకటించడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఈ క్రమంలోనే ఇక నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే దానిపై మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సమంత నాగ చైతన్య తో విడాకులు తరువాత సినీ కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి సారించారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది సమంత. కుదిరితే ఇక బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రాణించాలి అని భావిస్తోంది. ఇకపోతే ఇటీవలే అక్కినేని నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత అక్కినేని కాంపౌండ్ లో కనిపించడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది


 అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో కనిపించింది సమంత. దీంతో సమంత అసలు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఎందుకు వచ్చింది అన్నది మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. కాగా ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం అనే సినిమాలోకీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా డబ్బింగ్ కోసమే  ఇటీవలే సమంత అన్నపూర్ణ స్టూడియోస్  ను సందర్శించారట. కేవలం ప్రొఫెషనల్ గా మాత్రమే సమంత అన్నపూర్ణ స్టూడియో కి వచ్చారని.. పర్సనల్ విషయాల గురించి కాదు అన్న విషయం పై క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: