మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు బాగా సంపాదిస్తున్న అప్పటికీ ఇతర వ్యాపారులు సైతం తమ అడుగు వేస్తూ మరింత ఎక్కువ సంపాదించాలని ఉద్దేశ్యంతోనే ఏవేవో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలా అలా చేస్తున్న సమయంలో కొంత మంది మోసపోతూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అదే జరిగింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త శిల్ప చౌదరి కొంతమంది సినీ సెలబ్రిటీస్ ను మోసం చేసినట్టుగా తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


శిల్పా చౌదరి ఒక ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి మన సెలబ్రిటీలతో పాటు, కొంతమంది ప్రముఖ వ్యాపార వేత్తలు కూడా ఈమె దగ్గర మోసపోయినట్లు తెలుస్తోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు ఈమె మోసం చేసినట్లు గా సమాచారం. దీంతో నార్సింగ్ పోలీసులు ఈమెను తన భర్తను ఈరోజు ఉదయం అరెస్టు చేయడం జరిగింది. ఈమె వలలో చిక్కుకున్న ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పబ్లు పార్టీలు అంటూ కొంతమంది సెలబ్రిటీస్ ను ఆకర్షిస్తూ మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లుగా సమాచారం.

దీంతో అసలు విషయం తెలుసుకున్న సెలబ్రెటీలు పోలీస్ స్టేషన్ లో ఈమె పై ఫిర్యాదు చేయడం జరుగు తోంది. ఈమె అలా పార్టీ ఇస్తున్న సమయంలో కొంతమంది బడా పేర్లను చెప్పి అధిక వడ్డీ ఇప్పిస్తానని కొన్ని వందల కోట్లు కొట్టేసి నట్లు పోలీసులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శిల్పా ఆమె భర్త ను కూడా  ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయడం జరిగింది.

ప్రస్తుతం వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈమె చేతిలో మోసపోయిన వారిలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలే కాకుండా కొంతమంది లాయర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే త్వరలోనే వారు నోరు విప్పితే ఎవ రెవరు నేను ఉచ్చుల పడ్డారో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: