టాలీవుడ్
సినిమా పరిశ్రమలో యంగ్ హీరోయిన్లు మాత్రమే కాదు సీనియర్ హీరోయిన్లు కూడా తమ హవాను చూపిస్తున్నారు. దాదాపు తమ కెరీర్ అయిపోయిందనుకున్న
హీరోయిన్ లు మళ్లీ
సినిమా అవకాశాలు అందుకోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు
హీరోయిన్ గా తమ సత్తా చాటిన వారు
టాలీవుడ్ లో ఇప్పటికీ హీరోయిన్లుగా రాణిస్తూ వారి సత్తా చాటుతున్నారు. 99, 2000 దశకంలో హీరోయిన్లు గా రానించిన కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్లు గా నటిస్తుండటం విశేషం.
వీరు ఇలా రానిస్తుండడం కొంతమంది హీరోయిన్లకు కొంత ఆందోళన కలిగిస్తుంది. అలాంటి వారిలో
మీనా మరియు
రమ్యకృష్ణ ఒకరు.
నాగార్జున బాలకృష్ణ
చిరంజీవి వెంకటేష్ వంటి హీరోలతో వీరు
హీరోయిన్స్ గా ఎన్నో సినిమాలను చేసి టాప్ హీరోయిన్లు గా ఎదిగారు. అంతేకాదు ఆ తర్వాత వారి టైం పూర్తయినప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించగా పలు
సినిమా లతో
సినిమా పరిశ్రమలో కొనసాగారు.
రమ్యకృష్ణ బాహుబలి
సినిమా తో ఒక్కసారిగా తన స్థాయిని మార్చుకుంది. ఆ చిత్రంలో ఆమెకు వచ్చిన పేరు మామూలుది కాదు. దేశ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది రమ్యకృష్ణ.
మీనా కూడా అప్పట్లో అందరు స్టార్ హీరోలతో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయింది. కానీ ఇప్పుడు
వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో నటించి మళ్ళీ
హీరోయిన్ గా కనిపించింది. దృశ్యం 2 చిత్రం లో కూడా ఆమె
హీరోయిన్ గా కనిపించింది. ఇక
నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో
హీరోయిన్ గా నటించిన
రమ్య కృష్ణ ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో
హీరోయిన్ గా చేస్తోంది. ఆ విధంగా ఈ వయసులో కూడా వీరు హీరోయిన్లుగా నటిస్తూ కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పట్టిస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు మీరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే.