ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తర్వాత ఆచితూచి తన సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఆయన నటించే ప్రతి సినిమా కూడా ఇండియా వైడ్ గా విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. జనవరి 14 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించపోతుండగా ఈ సినిమా విడుదల కాకముందే ప్రభాస్ నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు వేసుకున్నాడు.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురాబోతుండగా అలాగే బాలీవుడ్ సినిమా ఆది పురుస్ కూడా సగభాగం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు సిద్ధంగా ఉంది.  వీటికి సంబంధించిన విడుదల తేదీలను కూడా చిత్రబృందం త్వరలోనే ప్రకటించనుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరియు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని సినిమాను తొందరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్ళను న్నాడు ప్రభాస్. 

అయితే సాహో సినిమా విడుదలైన దాదాపు మూడు సంవత్సరాలకు గానీ తన రాధే శ్యామ్ సినిమాను విడుదల చేయడం లేదు ప్రభాస్. దాంతో ఈ చిత్రంపై అందరూ పెదవి విరిచారు. ఈ చిత్రం అప్డేట్ ల విషయంలో కూడా చాలా ఆలస్యం చేయడంతో అందరూ విరుచుకుపడ్డారు. ఇన్ని విమర్శల మధ్య ఈ చిత్రం చేయడం ఎందుకని దర్శకుడిని కూడా చాలా విమర్శించారు అభిమానులు. ఇప్పుడు అప్డేట్ లు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్న కూడా ఈ దర్శకుడి పై పడ్డ నెగటివ్ ఇమేజ్ తొలగి పోవడం లేదు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ చేయాలని భావిస్తుండగా ఇప్పటివరకు రాధే శ్యామ్ విషయంలో ఆయన ఎదుర్కొన్న విమర్శల దృష్ట్యా అల్లు అర్జున్ ఆయనతో సినిమా చేయడం మంచిది కాదని కొంతమంది సలహాలు ఇస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: