బాలీవుడ్,
టాలీవుడ్ సినిమా పరిశ్రమలలో ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన హీరోలు. ప్రస్తుతం ఉన్న బడా చిత్రాలలో చాలా వరకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలే ఎక్కువగా సెట్స్ పైన ఉన్నాయి. మన హీరోలు స్పోర్ట్స్ ఆటగాళ్ల మారిపోతూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో క్రికెటర్స్ బయోపిక్ సినిమాలు తెరకెక్కుతు ఉండగా,
ఫుట్ బాల్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ను టచ్ చేస్తూ కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాయి.
ఇక వుమెన్ సెన్సేషనల్ క్రికెటర్ మిథాలీ
రాజ్ బయోపిక్ తో
తాప్సి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే భారతీయ
క్రికెట్ కు ఎంతగానో ఫేమ్ తీసుకు వచ్చిన ఆటగాడు గంగూలీ బయోపిక్ కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యువరాజ్ సింగ్, సెహ్వాగ్,
హర్భజన్ సింగ్ వంటి వారి బయోపిక్ లు కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక బాక్సింగ్ నేపథ్యంలో
విజయ్ దేవరకొండ మరియు
పూరి జగన్నాథ్ ల కాంబో లో లైగర్ అనే
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫుట్ బాల్ నేపథ్యంలో మైదాన్ అనే
సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో లక్ష్య మరియు గుడ్ లక్ సఖి అనే చిత్రాలు కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్నాయి.