నటసింహ గా..యువరత్న రానా గా .. గుర్తింపు పొందిన బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరొకపక్క రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ ఇంకొక పక్క బుల్లితెరపై కూడా తన సత్తా ఏంటో చాటుకున్నాడు. తన ఉగ్రరూపం తో ప్రేక్షకులను భయపెట్టిన బాలయ్య బాబు తన నటనతో , డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. బాలయ్య బాబు డైలాగ్ లకు ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

ఈయన ఒక్కసారి డైలాగ్స్ చెప్పాడు అంటే సినిమా థియేటర్లన్ని దద్దరిల్లి పోవడమే కాకుండా దాదాపు సంవత్సరాల తరబడి ఆ డైలాగు ప్రేక్షకుల నోట బాగా పాపులారిటీ పొందుతుంది అంటే బాలకృష్ణకు ప్రేక్షకులలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్య బాబు వ్యక్తిగత విషయా నికి వస్తే.. వసుంధరాదేవిని ఈయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక వసుంధరాదేవి ఎవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయినటువంటి దేవరపల్లి సూర్యరావు అమ్మాయి వసుంధరాదేవి.. అయితే వసుంధరాదేవి ని బాలకృష్ణ వివాహం చేసుకోవడానికి కారణం ఆయనే అని సమాచారం. ఆయన ఎవరో కాదు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గా చలామణి అయిన నాదెండ్ల భాస్కర రావు.

కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు తన ముఖ్యమంత్రి పదవి కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావుకు ఆత్మీయ మిత్రుడు కూడా.. అంతేకాదు నాదెండ్ల భాస్కరరావు ప్రోత్సాహంతోనే నందమూరి తారక రామారావు పార్టీ ని ఏర్పాటు చేసి ఇక ఆ పార్టీలో నాదెండ్ల భాస్కరరావును ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఈయన వల్లే బాలయ్య బాబు వసుంధరాదేవి ని వివాహం చేసుకోడానికి కారణమని నాదెండ్ల భాస్కరరావు స్వయంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక బాలయ్య బాబుకు కట్నంగా వసుంధరాదేవి తండ్రి సూర్యారావు రూ. 10 లక్షల కట్నం ఇస్తే , ఆ డబ్బుతో ఎన్టీఆర్ నందమూరి కి హైదరాబాద్ లోని ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: