నందమూరి
బాలకృష్ణ హీరోగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన తాజా చిత్రం అఖండ. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా
హీరో అల్లు
అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చి చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.
రాజమౌళి కూడా ఈ
సినిమా కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు
సినిమా పరిశ్రమకు మార్గదర్శకంగా ఈ చిత్రం ఉండబోతుంది అని చెప్పొచ్చు. రెండవ లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమాగా ఇది రాబోతుండగా ఆ చిత్రం విజయవంతం అవ్వాల్సిన అవసరం
ఇండస్ట్రీ కి ఎంతో ఉందని చెప్పవచ్చు.
దానికి తగ్గట్లే ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని
బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని భారీ
మాస్ మసాలా చిత్రం గా చేశారు. మొదటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా అనగానే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వీరి కాంబో లో వచ్చిన
సింహ లెజెండ్ చిత్రాలు
బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో
సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అందరూ భావించారు. మరి
డిసెంబర్ 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ రోజున ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అనేది చూడాలి.
ఇక నందమూరి అభిమానులకు ఐ ఫీస్ట్ గా ఈ
సినిమా ఉండబోతుందని ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్రబృందం గట్టిగా చెబుతోంది.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి
తమన్ సంగీతం అందించగా ఆయన సంగీతం అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఏది ఏమైనా భారీ అంచనాలతో
బాలకృష్ణ నటించిన ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఇండస్ట్రీకి కూడా ఈ
సినిమా హిట్ ఎంతగానో అవసరం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతోంది, ఎలాంటి విజయం నమోదు చేసుకుంటుంది అనేది చూడాలి.