టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తెలుగులో దాదాపు ఎక్కువ సినిమాలు చేస్తుంది తమనే. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు బాలకృష్ణ, రవితేజ దాదాపు ఇలా అందరి పెద్ద హీరోల సినిమాలు అన్నీ థమన్ చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ 'అల వైకుంఠ పురం లో' సినిమా తర్వాత తమన్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా పాటలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో తమన్ కంపోజ్ చేసిన ఈ పాటలు భారీ స్థాయిలో వ్యూస్ అందుకని చాలాకాలంపాటు ట్రెండింగ్ లో నిలిచాయి.

 అందుకే యువ హీరోలతో మొదలుకొని స్టార్ హీరోల దాకా అందరూ తమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ నే ఎంచుకుంటున్నారు. అయితే ఇది ఇలా ఉంటే తమన్ ని ఓ సాంగ్ చాలా డిసప్పాయింట్ చేసిందట. ఆ సాంగ్ హిట్ అవుతుందని తమన్ ఎంతో నమ్మకంగా ఉన్నా.. చివరికి ఆ పాట తనను డిసప్పాయింట్ చేసిందని తాజాగా తమన్ వెల్లడించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అరవింద సమేత' సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమాలో 'యాడ బోయినాడో' అనే పాట కోసం తమన్ ఎంతో శ్రమించాడట.

 ఈ పాట కోసం వైజాగ్ నుంచి లిఖిత అనే అమ్మాయిని పిలిపించి మరీ ఆ పాటను పాడించారు. ఆ పాట ట్యూన్ కానీ, ఆ పాటను పాడటం అంటే చాలా కష్టం. అలాంటి పాటను తమన్ ఎంతో కష్టపడి కంపోజ్ చేశారట. పాట మంచి హిట్ అవుతుందని అనుకున్నా కానీ నన్ను ఈ పాట చాలా డిసప్పాయింట్ చేసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం తమన్ మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు ఇప్పటికే తమన్ మ్యూజిక్ అందించిన అఖండ సినిమా విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: