టాలీవుడ్ టాప్ హీరో విజయ్ దేవరకొండ  నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'లైగర్'.ఈ సినిమాను పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుగుతోంది.నిజానికి దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కలమవుతుంది.కానీ కరోన కారణంగా ఆలస్యంగా జరుగుతుంది.అయితే  విజయ్ దేవరకొండ ఫాన్స్ మాత్రం ఈ సినిమా అప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కానీ మహేష్ చేసిన సినిమా కూడా అదే సమయంలో రానుంది.దేనితో మేకర్స్ ఎమ్ చేస్తారో చూడాలి.మహేష్  పరశురామ్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా 'సర్కారు వారి పాట'.అయితే ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఇప్పుడు మాత్రం ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు..విజయ్ దేవరకొండ కూడా అదే తేదీన వస్తే మాత్రం క్లాష్ తప్పదు.ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూస్తే దేవరకొండ కన్నా మహేష్కె ఎక్కువ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.

కానీ యూత్ పరంగా చూస్తే యూత్ లో విజయ్ కె ఎక్కువ  ఫాలోయింగ్ నడుస్తుంది.విజయ్ సినిమాలకు కూడా యూత్ ఫాన్స్ బాగానే ఉన్నారు.విజయ్ సినిమాలకు యూత్ లో చాలానే డిమాండ్ నడుస్తోంది.ఇకపోతే రెండు సినిమాలు ఒకే డేట్ కి ఉండడం తో ఎవరూ తగ్గే అవకాశం కనిపించడం లేదు. మహేష్ అయితే ఈ తేదీ నుంచి వెనక్కి తగ్గే ఛాన్స్ లేదనిపిస్తుంది జగన్ ఇప్పటికే మహేష్ బాబు ఒక సారి తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. కాబట్టి కచ్చితంగా మహేష్ బాబు వెనక్కి తగ్గడు  అయితే వీరిద్దరిలో ఎవరు వెనకడుగు వేస్తారో చూడాలి మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: