బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు అయిన రణబీర్ కపూర్, ఆలియా భట్ గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికి తెలిసిందే . దీంతో ఈ ప్రేమజంట ఎప్పుడెప్పుడు ఒక్కటవుతుందని బాలీవుడ్ ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఇద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలియడంతో ఈ జంట హద్దులు చెరిపేసి ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. మరోవైపు ఈ జంట తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నా.. ఖాళీ సమయంలో మాత్రం ఒకరిపై మరొకరు తమ ప్రేమని పంచుకుంటున్నారు. ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 అయితే గత ఏడాదే రణబీర్, ఆలియా భట్ పెళ్లి చేసుకోవాల్సి ఉండగా..కరోనా  మహమ్మారి కారణంగా వీరి పెళ్లి వాయిదా పడింది. అయితే ఇటీవల వీరి పెళ్లిడిసెంబర్ నెలలో అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మరోసారి ఈ జంట తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు కారణం ఏంటంటే.. ఈ ఇద్దరు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా షూటింగ్స్ పూర్తి కాకపోవడంతో పాటు పలు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈ సంవత్సరం కూడా తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట ఈ జంట ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ పూర్తి చేశాక అప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

అంతే కాదు హ్యాపీ గా పెళ్లి చేసుకొని పెళ్లి తర్వాత ఒక ఖరీదైన ఫ్లాట్లో ఉండాలని అనుకుంటున్నారట. అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం కొన్ని పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలల్లో లేకపోతే 2022 డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ జంట కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ సినిమాలో మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక వీటితో పాటు ఇతర ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు ఈ ప్రేమజంట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: