స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మనం ప్రత్యేకంగా ఏమి పరిచయం చేయనవసరం లేదు. అల్లు అర్జున్ సినిమాలు ఎన్నో విభిన్నమైన పాటలు రాశారు సీతారామ శాస్త్రి గారు. అయితే అలా వైకుంఠపురం సినిమా ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంటే.. నాకు కూడా వివసత్వమే, వివసత్వము అంటే ఒళ్ళు మర్చిపోయేలా అంత ఇష్టం అని తెలియజేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. బన్నీకి నేను చాలా తక్కువ పాటలు రాశాను. ఒకసారి అల్లు అర్జున్ గురించి అల్లు అరవింద్ గారి తో ఇలా అన్నాను.. మీ వాడిని ఒక్కసారి కుదురుగా ఉండమనండి, పాట రాస్తాను అని తెలియజేశారు అని చెప్పుకొచ్చారు. అలా ఎందుకన్నానంటే.. ఒక విద్యుత్ తీగ ఎలా ప్రవహిస్తుందో ఆయన కూడా అలా ప్రవహిస్తుంటే.. నేను కళ్ళు ఎదురుచూస్తూ ఉంటాను ఎలా పాటలు రాస్తానని తెలియజేశారట.

బన్నీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే అలా చెప్పానని తెలియజేశారు. అల్లుఅర్జున్ సంస్కారం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మా బావ గారు అయినా అల్లు అర్జున్ తో కూడా మాట్లాడానని తెలియజేశారు. ఆయన ఫ్యామిలీ లో ఉన్న వారందరూ బిహేవియర్ లో గాని, వారి చిరునవ్వు గాని, చాలా అద్భుతంగా ఉంటుందని ఒకానొక సందర్భంలో ఆయన తెలియజేశారు.

ఇక వీటన్నిటిని అల్లు అరవింద్ తన భుజాల మోస్తున్నాడని తెలియజేశారు. ఇక అల వైకుంఠపురం సినిమా ఈ సంక్రాంతికి సక్సెస్ కావాలని ఈ సినిమాని తీర్చిదిద్దిన త్రివిక్రమ్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు సీతారామశాస్త్రి. ఈ సినిమా చూసే దానికోసం గళ్ళు గళ్ళు న థియేటర్లకు నడిచి వస్తారని తెలియజేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని కూడా తెలియజేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: