సిరివెన్నెల భౌతికకాయాన్ని అభిమానులు, సినీ పరిశ్రమ శ్రేయోభిలాషుల కోసం ఈరోజు ఉదయం 6 గంటలకే ఫిల్మ్ ఛాంబర్కు తీసుకొచ్చారు. అద్భుతమైన గేయ రచయిత అనూహ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాయకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఈ తరుణంలోనే ప్రముఖ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ సిరివెన్నెల మృతిపై ఇన్స్పిరేషనల్ పోస్ట్ చేసారు.
సీతారామశాస్త్రీ తో నా ఫస్ట్ మెమొరీ… అన్నపూర్ణ స్టూడియోలో ఓ చెట్టుకింద కూర్చుని ఒక సిట్యుయేషన్ చెప్పి కళాశాల సాంగ్ లో కవిత్వం ఉండొద్దు అండి. మాములుగా విద్యార్థులు మాట్లాడే మాటలు.. మాటలో నుంచి పాట వచ్చినట్టుగా ఉండాలి అని చెప్పారు అని గుర్తు చేసారు. రెండు మూడు సెకండ్లలోనే ‘బాటనీ పాఠముంది’ సాంగ్ రాశారు సిరివెన్నెల. ఇలా తలచుకుంటూ పోతే ఆయనతో ఎన్నెన్నో మెమొరీలు, ఇప్పుడు జరిగిన ఘటన ప్రతి ఒక్కరికీ షాకింగ్ అని వెల్లడించారు వర్మ.
నాకు తెలిసిన ఓ ఫిలాసఫర్ చెప్పిన ప్రకారం .. అందరూ జీవిస్తారు కానీ కొంతమంది మాత్రం ముందు తరాలకు ఒక మార్గదర్శిగా, ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతారు అని వెల్లడించినట్టు వివరించారు. ఒకవైపు నుంచి ఆయన మరణించినందుకు ఇంతా బాధగా ఉన్నా… ఆయన లైఫ్ టైంలో చేసినవన్నీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అని చెప్పారు. సిరివెన్నెల పాటలను ఎప్పుడూ తలచుకుంటారని, ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా సినిమాల్లో ఆయన చేసిన కృషి కారణంగా ఎప్పటికీ మన మధ్య బ్రతికే ఉంటారనే విషయం మాత్రం నాకు ఆనందం కలిగిస్తోంది అని సిరివెన్నెల అభిమానులకు ధైర్యం కలిగించే విధంగా తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు రామ్గోపాల్ వర్మ.