బిగ్ బాస్ సీజన్ 5 మరో మూడు వారల్లో ముగియనుంది. ఫైనల్ ఎపిసోడ్ డేట్ దగ్గర పడే కొద్ది కంటెస్టేంట్స్ తో పాటు బయట ఉన్న అభిమానుల్లోను కంగారు పెరిగిపోతుంది. ఈ సిజీన్ కి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారా అనీ సోషల్ మీడియాలో ఎప్పటినుండో పోల్స్ నడిపిస్తున్నారు. ఎవరి అభిమానులు వాళ్ల కంటెస్టెంట్ నే బిగ్ బాస్ టైటిల్ గెలిచి విన్నర్ గా నిలుస్తాడు అంటూ కాన్ఫిడేంట్ గా చెప్పుతున్నారు. బయట పరిస్ధితులు చూస్తుంటే ముఖంగా ఇద్దరు హౌస్ మేట్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచేటట్లు తెలుస్తుంది.

యస్.. టాప్ 5 లో ఉండే వాళ్లు ఎవరైనా సరేకానీ, కచ్చితంగా సన్నీ, షణ్ముఖ్ మధ్య భీబత్సమైన కాంపిటీషన్ ఉంటుందంటున్నారు నెటిజన్లు. కాగా, ఈ వారం హౌస్ లో టికెట్ టు ఫినాలే రేస్ మొద‌లైంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేసాడు. ప్రతి సారి లాగే ఈసారి కూడా ఒక్క హౌస్ మేట్ ని డైరెక్ట్ గా ఫైనల్స్ కు పంపించేదుకు రెడి అయ్యింది బిగ్ బాస్. ఈ క్రమంలో ఈ వారం హౌస్ లో కొన్ని టాస్కులు ఇచ్చి వాటిలో  ఎక్కువ పాయింట్లు ఎవరికి వస్తాయో దాని ఆధారంగా టికెట్ టు ఫినాలే అందుకోనున్నారు. దీంతో  ఈసారి బిగ్ బాస్ హౌస్ లో నేరుగా ఫైన‌ల్ కు వెళ్లే కంటెస్టెంట్ ఎవరా అని ప్రేక్షకులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.

కాగా టికెట్ టు ఫినాలే రేస్ లో భాగంగా  బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. టాస్క్ లో భాగంగా ప్రతి కంటెస్టేంట్ కి ఐస్ ట‌బ్ ఇచ్చి దాని లో కాళ్లు ఉంచి..బయటకు వచ్చిన్నపుడల్లా  వేరోక కంటెస్టేంట్ వాళ్ల బుట్టలో ఉన్న బాల్ ని తీసుకోవచ్చు. ఇలా  గేమ్ ఆడుతున్నప్పుడు కొంద‌రు కంటెస్టెంట్స్ కి కాస్త ఇబ్బంది అయిన‌ట్లు తెలుస్తోంది.  దీంతో  న‌లుగురు కంటెస్టెంట్లకి కాళ్లు బాగా వాచిపోయిన్నట్లు తెలుస్తుంది. దీంతో వాళ్లకి ట్రీట్ మెంట్  అవసరం అవ్వడంతో.. మెడిక‌ల్ రూమ్ కి పంపించారట బిగ్ బాస్. కాళ్లు ఎక్కువ సేపు ఐస్ లో ఉంచ‌డం వ‌ల్లే ఇలా జరిగింది అంటున్నారు నెటిజన్స్. దీని పై అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త టాస్క్ లు ఇచ్చి ఆరోగ్యం పాడు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇక ఈ గేమ్ లో  ఎవ‌రు గెలుస్తారు అనేది ఇవాళ  తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: