అసలే భారీగా ఫ్లాపులు అందుకొని తన కెరియర్ ను సందిగ్ధంలో పడేసుకున్నాడు నాని. ఆయన హీరోగా నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అంతకు ముందు వరుస విజయాలతో స్టార్
హీరో గా మారిన
నాని ఒక్క సారిగా ఈ ఫ్లాపుల పరంపరకు తెరలేపి మళ్ళీ యదా స్థానానికి వచ్చినట్లు అయింది. దాంతో ఆయన అభిమానులు వాటన్నిటికీ సమాధానం చెప్పే విధంగా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని చెబుతున్నారు. ఆ విధంగా ప్రస్తుతం
నాని చేస్తున్న
శ్యామ్ సింగ రాయ్ చిత్రం తో ఆయన సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు.
టాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకులను సరికొత్త కాన్సెప్ట్ తో ఎంతగానో అలరించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తన రెండో సినిమాగా నానితో కలిసి
శ్యామ్ సింగ రాయ్
సినిమా చేయగా ఈ చిత్రం కూడా వెరైటీ కథనంతో తెరకెక్కిందని ఇప్పటికే ఈ
సినిమా అప్డేట్ లను బట్టి అందరికీ తెలిసింది. కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కగా ఈ సినిమాలో
సాయి పల్లవి మరియు కృతి శెట్టి అలాగే
మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాను సోలోగా విడుదల చేయాలని చెప్పి
డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయాలనుకున్న
నాని అప్పుడు అఖండ
సినిమా తనకు పోటీగా వస్తుందని తెలిసి
డిసెంబర్ చివరి వారంలో కి
సినిమా ను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అయితే అప్పుడు ఓ పాన్
ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఒకసారిగా ఆయనకు షాక్ తగినట్లు అయ్యింది. కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 సంవత్సరంలో టీమిండియా తొలిసారి
వరల్డ్ కప్ సాధించగా ఈ
వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కిన
సినిమా 83. ఈ చిత్రం
శ్యామ్ సింగ రాయ్ వచ్చే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇప్పుడు
నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.