విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూడవ చిత్రం పుష్పకవిమానం. నవంబర్ 12వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాగా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన అందుకుని ఈ చిత్రం మంచి సినిమా గా నిలిచింది. దామోదర అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కాగా విజయ్ దేవరకొండ తో కలిసి విజయ్ మట్టపల్లి మరియు ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఏది ఏమైనా కామెడీ సినిమాగా ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉండగా ఆ తర్వాత ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని తెలిసి ఒక్కసారిగా థ్రిల్ కి గురయ్యారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఆనంద్ నటన హైలెట్ కాగా ఆ తర్వాత అంతటి స్థాయిలో హీరోయిన్ గా నటించిన శాన్వి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. సినిమా చిత్రీకరణ పరంగా మంచి సంతృప్తి ని పొందగా ప్రేక్షకులను అలరించే విషయంలో అందరూ బాగా ఎంజాయ్ చేయగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడ సాగారు కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు.

ఇకపోతే తాజాగా ఈ చిత్రాన్ని ఆహా లో విడుదల చేస్తున్నట్లుగా ఆహా సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమ్ కాబోతుందని వారు అధికారికంగా ఈ రోజు వారి సోషల్ మీడియా లో వెల్లడించారు. అయితే థియేటర్లలో విడుదలై నెల కాకముందే ఈ చిత్రం ఓ టీ టీ లోకి రావడం ఒక్కసారిగా సినీ ప్రియులకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మరి థియేటర్లలో ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన ఈ సినిమా ప్రేక్షకులను కూడా ఏ రేంజిలో అలరిస్తుందో చూడాలి. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాలతో నటుడిగా తనను తాను నిరూపించుకుని ఆనంద్ దేవరకొండ అదే స్థాయిలో ఈ సినిమాలో కూడా నటించి వరుసగా మూడవ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: