ఇటీవల సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది, కొన్ని రోజుల క్రితం నాగ చైతన్య తో విడాకుల విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సమంత, ప్రస్తుతం తాను చేస్తున్న క్రేజీ సినిమాల విషయం లో వార్తల్లో నిలుస్తోంది. తెలుగు లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, తెలుగుతో పాటు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ది ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, ఇది ఇలా ఉంటే తాజా గా సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ కు చెందిన బడా నిర్మాణ సంస్థ ల్లో ఒకటైన యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సమంత తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

  ఇందు లో భాగం గా ఒకే సారి మూడు చిత్రా లకు ఒప్పందం చేసుకునేందుకు సమంత కు ప్రపోజల్‌ పెట్టారంట సదరు నిర్మాణ సంస్థ వాళ్లు, ఇందు కోసం సమంత కు భారీ మొత్తం లో ముట్ట చెప్పేందుకు సదరు నిర్మాణ సంస్థ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సమంత కూడా సదరు నిర్మాణ సంస్థ డీల్ కు సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సమంత కేవలం టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ లోను నటించడానికి రెడీ గా ఉంది. ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగు లో శాకుంతలం సినిమా లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: