టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లీడర్ సినిమా తో వెండి తెరకు పరిచయం అయ్యాడు, మొదటి సినిమా లోనే అద్భుతమైన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇలా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకున్న రానా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన బాహుబలి సినిమా లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ని పెంచుకున్నాడు. ఇలా హీరో గా, విలన్ గా నటించి ఇండి యా వైట్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రానా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు హీరో గా నటిస్తున్నాడు. ఈ సిని మా వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

సినిమా తో పాటు రానా 'విరాట పర్వం' సినిమా లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న రానా తనలో ఉన్న కొత్త టాలెంట్ ను ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రానా సంగీత దర్శకుడి గా మరే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి రానాసంగీత ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ తో కలిసి రానా, తన స్నేహితుడి సినిమాకి సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సలహాలు, సూచనల తో దగ్గుబాటి రానా సినిమా కి మ్యూజిక్ కంపోజర్ గా మారాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: