ఇప్పటి హీరోలు ఏపీ ప్రజల అభిమానాలతో స్టార్ హీరోలు అయ్యి వారిని పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు స్పందిస్తూ తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వంతుగా వరద బాధితుల కోసం రు. 25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక మెగాస్టార్ చిరంజీ వితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం ఈ రోజు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు.
ముందుగా చిరంజీవి తన వంతుగా రు. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం చిరంజీవి బాటలోనే పయనించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి మొత్తం ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ట్టు అయ్యింది. ఏదేమైనా ఏ విపత్తు వచ్చినా కూడా ఆదుకునే విషయంలో తాము ముందు ఉంటామని మరో సారి మెగా ఫ్యామి లీ ఫ్రూవ్ చేసుకుంది.
ఇక రామ్ చరణ్ కంటే ముందే చిరంజీవి స్పందించారు. ఆయన తన వంతుగా వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఇచ్చారు. ఆ తర్వాత చెర్రీ కూడా స్పందించారు. మరి వీరి బాటలోనే మిగిలిన హీరో లు కూడా స్పందిస్తారేమో ? చూడాలి.