రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమా "అఖండ"కు వచ్చిన రెస్పానస్ చూసి " పుష్ఫ" టీం షాక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన అఖండ సినిమా డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యం గా ఈ సినిమాలో అఘోర పాత్రలో నటించిన బాలయ్య పర్ ఫామెన్స్ చూసి అందరి షాక్ అయ్యారు. ఆ డైలాగ్స్ చెప్పడం గాని,ఆ ఫేస్ ఎక్స్ ప్రేషన్స్ చూయించడం లో బాలయ్య ఇరగదీసాడు. దీంతో గత కొంతకాలంగా హిట్ పడని బాలయ్య కు ఈ సినిమా భారీ విజయాని అందించింది. అంతేకాదు బాక్స్ ఆఫిస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా వకీల్ సాబ్ రికార్డులను కొల్లగొట్టి.. సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఈ క్రమంలో నెక్స్ట్ రాబోయే   సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప".. మూవీ టీం కొంత భయపడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 17న మన ముందుకు  రాబోతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇక రెండు వారాలు ఉంది. ఈ 14 రోజుల్లో బాలయ్య సినిమా అఖండ వేడి చల్లారితే ఓకే..లేకపోతే "పుష్ప" కు తిప్పలు తప్పవు అంటున్నారు విశ్లేషకులు. "పుష్ప" సినిమా పై ముందే భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఒక్కవేళ బన్నీ వాటిని ఫుల్ ఫిల్ చేయలేకపోయినా..ఈ "పుష్ప" సినిమా "అఖండ" రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయిన బన్నీ కి భారీ ఎదురుదెబ్బ తప్పదంటూ సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మొదటిసారి రష్మిక మందన అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటించడమే కాకుండా..డిగ్లామరస్ రోల్ లో కూడా నటిస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక బన్నీ కూడా ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ పక్కన ఓ స్పెషల్ సాంగ్ చేయూడానికి ఓకే చెప్పి సమంత అందరికి షాక్ ఇచ్చింది. టోటల్ ఈ సినిమాకి ఈ పాటే హైలెట్ గా నిలవనుందట. ఈ పాటలో సమంత బన్నీ మాస్ స్టెప్స్ ధియేటర్స్ కి వచ్చిన జనాలు చేత విజిల్స్ వేయించడం పక్కా అంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: