స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గతంతో తీసిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే వాటిలో తొలిసారిగా తీసిన ఆర్య సూపర్ హిట్ కొట్టగా ఆర్య 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక మళ్ళి చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

మొత్తం రెండు భాగాలుగా పాన్ ఇండియా సినిమాగా ఏకంగా ఐదు భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీటిలో పుష్ప పార్ట్ 1 దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా దీనిని ఈ నెల 17న భారీ ఎత్తున విడుదల చేయనుంది యూనిట్. సుకుమార్ ఎంతో భారీ స్థాయిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్,అలానే సాంగ్స్ అన్నిటికీ ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది.

మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఫస్ట్ పార్ట్ 1 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 6న విడుదల కానుండగా ట్రయిలర్ లోని కొన్ని కీలక సీన్స్ ని తీసుకుని దానిని టీజ్ పేరుతో నేడు సాయంత్రం 6 గం. 3 ని. లకు రిలీజ్ చేయనుంది పుష్ప చిత్ర యూనిట్. ఇప్పటికే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఇక ఇటీవల వరుసగా పుష్ప నుండి అప్ డేట్స్ వస్తుండడంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అంచనాలు మరింతగా పెరిగాయి. మరి మరొక పదిహేనురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: