తాజాగా అఖండ సినిమా విజయంతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసాడు బాలయ్య.కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇదే కావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం యావత్ సినీ ఇండస్ట్రీ ఎదురుచూసింది. ఈ క్రమంలోనే అఖండ మాస్ జాతర మొదలైంది.ఇక అఖండతో స్టార్ట్ అయిన ఈ హంగామాని కంటిన్యూ చేయడానికి వరుసగా అగ్ర హీరోలు క్యూ కడుతున్నారు.ఇక ఇదిలా ఉంటె బాలయ్య ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య పైసా వసూల్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్యను పూరీ చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

దాంతో బాలయ్యకి పూరీ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు.దాంతో ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఏర్పడింది.ఇక ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు.కాగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్ చార్మి ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాలో..

నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో బాలయ్య ఓ క్యామియో రోల్ లో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అన్న విషయం తెలియదు కానీ.. ఆ మధ్య ఓ లైగర్ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్న సమయంలో బాలయ్యసినిమా సెట్స్ లో సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ విషయం నిజమని నమ్మలేం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: